లంకె బిందెలకు అమ్మాయికి లింకు.. పూజల పేరుతో అత్యాచారం.. చెట్టుకు కట్టేసి దాడి..
మంత్రాలకు,తంత్రాలకు చింతకాయలు రాలవని నానుడి. కానీ ఇప్పటికీ మన సమాజంలో మంత్ర తంత్రాలకు అతీత శక్తులు ఉంటాయని నమ్మేవారు చాలామందే ఉంటారు. వీరి బలహీనతలను ఆధారంగా చేసుకుని దోచుకునేవాళ్లకూ కొదువ లేదు. ఇలాంటి దోపిడీ ఘటనలు గతంలో అనేకం వెలుగుచూశాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. అంత్రాలు,మంత్రాలతో జీవితాలను మార్చేస్తామంటూ తిరుగుతున్న ఓ వ్యక్తి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో ఈ ఘటన వెలుగుచూసింది.
థియేటర్లు , మల్టీ ప్లెక్స్ లను నిండా ముంచేసిన కరోనా లాక్ డౌన్..మూడు నెలల వరకు నో పర్మిషన్?
అసలేం జరిగింది..
నల్గొండ జిల్లా అడవిదేవిపల్లి మండలం మొగిలిచర్లకు చెందిన విష్ణువర్దన్ అలియాస్ రాంబాబు అంత్రాలు,మంత్ర తంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తుంటాడు. భార్యాభర్తల గొడవలు పరిష్కరిస్తానని,ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తీరుస్తానని నమ్మిస్తాడు. ఇతన్ని నమ్మి ఇప్పటివరకూ చాలామందే డబ్బులు పోగొట్టుకున్నారు. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా రుద్రసముద్రంకు చెందిన రామాంజితో రాంబాబుకు పరిచయం ఏర్పడింది.
పూజ పేరుతో అత్యాచారం..
రాంబాబు ఎక్కడికెళ్లినా రామాంజి కూడా అతనితో పాటే వెళ్లేవాడు. ఇటీవల రామాంజి అన్న బాలరాజు ఇంట్లో లంకె బిందెల కోసం రాంబాబు పూజలు చేశాడు. రాత్రిపూట ఇంట్లో క్షుద్రపూజలు చేశాడు. పూజకు అమ్మాయి కావాలని.. అలా అయితేనే లంకె బిందెలు వస్తాని చెప్పాడు. దీంతో బాలరాజు తన కూతురిని గదిలోకి పంపించాడు. అయితే పూజ పేరుతో రాంబాబు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అట్రాసిటీ కేసు నమోదు..
క్షుద్రపూజల విషయం గ్రామస్తులకు తెలిసి బాలరాజు ఇంటికెళ్లి నిలదీయాలనుకున్నారు. ఇంతలో విషయం తెలుసుకున్న రాంబాబు బాలికతో బైక్పై పరారయ్యేందుకు యత్నించాడు. అయితే గ్రామస్తులు మార్గమధ్యలోనే వారిని అడ్డుకుని చితకబాదారు. రాంబాబును చెట్టుకు కట్టేసి కొట్టారు. ఒక్క బాలరాజు ఇంట్లోనే కాదు.. ఆ గ్రామంలో పలువురి వద్ద పూజల పేరుతో రాంబాబు సుమారు రూ.3లక్షల దాకా వసూలు చేశాడని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో రాంబాబును అదుపులోకి తీసుకుని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.