రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha Police Station: దిశ పోలీస్‌ స్టేషన్లు ముస్తాబు: ఒకేసారి 18: వైఎస్ జగన్ చేతుల మీదుగా..!

|
Google Oneindia TeluguNews

కాకినాడ: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, హత్యాకాండల దోషులకు 21 రోజుల్లో ఉరిశిక్ష విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దిశ చట్టంలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఆయా పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో నెలకొల్పిన దిశ పోలీస్ స్టేషన్‌ను ఆయన శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రిమోట్ ద్వారా ఇతర జిల్లాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లను లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నిజానికి- ఈ పోలీస్ స్టేషన్లు శుక్రవారం నుంచే తమ కార్యకలాపాలను ఆరంభించాల్సి ఉంది. 18 స్టేషన్లనూ ఒకేసారి అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉన్నందున.. ఒకరోజు వాయిదా వేశారు.

Chief Minister YS Jagan Mohan Reddy to open first Disha police station tomorrow

రాజమహేంద్రవరంలో పోలీస్‌ స్టేషన్‌‌ను ప్రారంభించిన అనంతరం ఆయన నన్నయ విశ్వవిద్యాలయానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన దిశ వర్క్‌షాప్‌‌లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వెంట హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతా ధికారులు హాజరవుతారు.

English summary
After enacting the 'Disha Act,' the Andhra Pradesh government shows its steely resolve by launching "Disha Police Stations'' across the state to especially deal with rape and POCSO cases on priority. On February 8, the first Disha Police Station' will come to operate in Rajamahendravaram at East Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X