రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Flash back 2019: గోదావరిలో లాంచీ మునక.. ప్రభుత్వ వైఫల్యానికి మచ్చుతునక!

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: మాటల కందని మహా విషాదం చోటు చేసుకున్న సంవత్సరం ఇది. 40 కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చి ఉదంతానికి సాక్షిగా నిలిచిన ఏడాది ఇది. ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన ఘటన ఇది. అదే- గోదావరిలో లాంచీ మునక. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద సుడులు తిరుగుతున్న గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ లాంచీ ప్రమాదానికి గురైన విషాద గాథను ఇప్పట్లో మన రాష్ట్ర మరిచిపోలేరు.

 గోదావరిలో లాంచీ వెలికితీత కోసం చివరి ప్రయత్నం: స్కూబా డైవర్లతో గోదావరిలో లాంచీ వెలికితీత కోసం చివరి ప్రయత్నం: స్కూబా డైవర్లతో

పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లి..

పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లి..

పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లిన పర్యాటకుల్లో 40 మందికి పైగా ఇక వెనక్కి తిరిగి రాలేదు. నిండుగా ప్రవహిస్తోన్న గోదావరిలో జల సమాధి అయ్యారు. మృతుల్లో ఎక్కువమంది తెలంగాణకు చెందిన వారే. హైదరాబాద్, వరంగల్ లకు చెందిన పర్యాటకులు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. సంఘటన చోటు చేసుకున్న రోజే 13 మృతదేహాలను వెలికి తీశారు సహాయక సిబ్బంది. అంతే. ఆ తరువాత ఒక్కో మృతదేహాన్ని గుర్తించడానికి రోజుల తరబడి గాలింపు చర్యలను కొనసాగించాల్సి వచ్చింది.

నెలన్నర రోజుల తరువాత..

నెలన్నర రోజుల తరువాత..


గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును వెలికి తీయడానికి నెలన్నర రోజుల సమయం పట్టిందంటే.. ప్రభుత్వ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి అప్పటికే ఉగ్రరూపాన్ని సంతరించుకోవడం, మునిగిపోయిన తరువాత.. లాంచీ నిండా బురద పేరుకునిపోవడం వంటి కారణాల వల్ల దాన్ని అనుకున్న సమయానికి వెలికి తీయలేకపోయారు.

ధర్మాడి సత్యం ద్వారా..

ధర్మాడి సత్యం ద్వారా..

నౌకాదళ సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, గజ ఈతగాళ్లు రోజుల తరబడి ప్రయత్నించినప్పటికీ.. లాంచీని వెలికి తీయలేకపోయారు. చివరికి కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ యజమాని ధర్మాడి సత్యం మీద ఆధారపడాల్సి వచ్చింది. బాలాజీ మెరైన్స్ నిపుణులు సైతం రాయల్ వశిష్ఠ లాంచీని తొలి ప్రయత్నాల్లో వెలికి తీయలేకపోయారు. చివరికి- వారు కూడా స్కూబా డైవర్ల ద్వారా బోటును వెలికి తీయగలిగారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా లాంచీని వెలికి తీయాల్సి రావడం.. వ్యవస్థ లోపాన్ని ఎత్తి చూపినట్టయింది.

మృతదేహాలను గుర్తించలేని దుస్థితి..

మృతదేహాలను గుర్తించలేని దుస్థితి..

ప్రమాదం చోటు చేసుకున్న సుమారు నెలన్నర రోజుల తరువాత కొన్ని మృతదేహాలు వెలికి తీశారు. లాంచీతో సహా అవి వెలికి వచ్చాయి. కుళ్లిన స్థితిలో వాటిని స్వాధీనం చేసుకున్నారు. లాంచీ శకలాల మధ్య అస్తిపంజరాలుగా మారిన మృతదేహాలు ఎవరివో కూడా గుర్తించలేని దుస్థితిని అనుభవించారు కుటుంబ సభ్యులు. ఇప్పటికి కూడా సుమారు 15 మంది పర్యాటకుల జాడ తెలియ రాలేదు. వారంతా మరణించి ఉంటారని నిర్ధారించారు.

English summary
The boat ''Royal Vasishta'' was on its way to the picturesque Papikondalu tourist spot in the middle of the river when it met with the accident, apparently on colliding with a large rock formation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X