పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?
కేఏ పాల్ గడిచిన ఎన్నికల్లో చేసిన హంగామా ఎంత...? ఆయన పోటి చేసిన పార్లమెంట్ స్థానాల్లో వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత.... ? ప్రజాశాంతీ పార్టీ ఎన్నీ సీట్లలో పోటి చేసింది. పాల్ పోటి చేసిన నరసాపురం పార్లమెంట్ స్థానంలో ఆయనకు ఎన్నిఓట్లు వచ్చాయి. అసలు ఆయనకు డిపాజిట్లు దక్కాయా..
జిమ్మిక్కులకు ఓట్లు రాలవయ్యా...పాల్
కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చేసిన హంగామా అంతాఇంతా కాదు..కొన్ని సీట్లలో తాను అప్పుడే గెలిచినట్టుగా కేఏ పాల్ వ్యవహరించాడు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఆయన నామినేషన్ వేశారు. మరోవైపు అయితే కేఏ పాల్ చేసిన నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి పోటి చేశారు. దీంతో ప్రచారంలో కూడ పలు సార్లు జిమ్మిక్కులు చేశాడు. వైసీపీ నేత జగన్కు వ్యతిరేకంగా ఆయన చాల ఆరోపణలే చేశాడు. మరోవైపు వైసీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న సుమారు 35 మందిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించి వివాదంలో చిక్కుకున్నాడు. దీంతోపాటు హెలికాప్టర్కు ఓటు వేస్తే ప్యాన్కు వెళుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఎన్నికల్లో తాను ప్రపంచ దేశాల అధినేతలనే గడగడలాడించానని చెబుతూనే ఆయన స్ట్రైల్లో ప్రచారం చేశారు. ఓట్లు వేసిన అనంతరం బయటకు వచ్చి డాన్స్ కూడ చేశాడు.
కేఏ పాల్కు పార్లమెంట్కు 1100 .. అసెంబ్లీకి 150
అయితే ఇంత చేసిన కేఏ పాల్ను మాత్రం ప్రజలు అంగీకరించలేదు. ఇంతపెద్ద స్థాయిలో కేఏ పాల్ జిమ్మిక్కులు చేసిన ప్రజల్లో మాత్రం పెద్దగా ఆదరణ మాత్రం కనిపించలేదు. ఈనేపథ్యంలోనే ఆయనకు ప్రజలు ఎన్ని ఓట్లు వేశారో తెలిస్తే షాక్ గురవడం ఖాయం... ఎందుకంటే ఆయన మొత్తం పార్లమెంట్ స్థానంలో పడిన ఓట్లు 1000 కూడ దాటే పరిస్థితి కూడ కనిపించలేదు. ఆయకు మధ్యహ్నం రెండు గంటల వరకు అందిన సమాచారం మేరకు 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇది ఎన్నికల్లో పోటీ చేసే ఓ అనామకుడు వేసిన వచ్చే ఓట్లు అని చెప్పవచ్చు. మరి ఈ ఓట్లను చూసి పాల్ ఎమంటాడో చూడాలి..ఇవన్ని ఈవీఎంల మాయ అంటాడో..లేదంటే పోలింగ్ అధికారులు తన గెలుపును అడ్డుకున్నారని చెబుతాడో వేచి చూడాలి. కాగా అసెంబ్లీకి 139 ఓట్లు పడ్డాయి.
నర్సాపురంలో ఓట్లు 12 గంటలవరకు
ఇక మొత్తం నర్సాపురం పార్లమెంట్ స్థానంలో మధ్యహ్నాం ఒంటిగంటవరకు వైసీపీ అభ్యర్థి కనుమూరి రఘురామ క్రిష్ణరాజుకు లక్ష ఓట్లు ఉండగా టీడీపీ అభ్యర్థి కాల్వపుడి శివ కు 89,832 ఓట్లు పోలుకాగా కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుకు 2831 రాగ జనసేన అభ్యర్థి నాగబాబుకు 50వేల పైచీలుకు ఓట్లు వచ్చాయి.