తూ.గో జిల్లాలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్.. రంగంలోకి దిగిన 3 పోలీసు బృందాలు..
తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు చిన్నారులు కనిపించడం లేదు. దీంతో వారి పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఖాకీలు రంగంలోకి దిగారు. పిల్లల కిడ్నాప్నకు సంబంధించి ఎలాంటి ఫోన్లు రాకపోవడంతో ఆందోళన నెలకొంది. చిన్నారుల ఆచూకీ కనిపించకపోవడంపై.. పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
రావులపాలెం మండలం రావులపాడులోనే ఇద్దరు చిన్నాులు కనిపించడం లేదు. నిన్న సాయంత్రం నుంచి ఇద్దరు పిల్లలు ఆచూకీ తెలియలేదు. వారి వయస్సు ఒకరికీ ఆరు, మరొకరి ఐదేళ్లు ఉంటాయని కుటుంబసభ్యులు తెలిపారు. కాలువ గట్లున గుడారంలో ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలు కావడంతో.. ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
Recommended Video
చిన్నారుల పేరంట్స్తో ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి ఆచూకీ కనుగొనేందుకు మూడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ పిల్లల పేరంట్స్ మాత్రం అల్లాడిపోతున్నారు.