RCB vs KXIP: జైత్రయాత్ర కంటిన్యూ చేస్తామంటోన్న ఆర్సీబీ.. విజయం కోసం పంజాబ్ తహ తహ..
ఐపీఎల్లో నేడు (గురువారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో ఆర్సీబీ ఫేవరేట్గా కనిపిస్తోంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో ఆర్సీబీ 58 శాతం విజయం సాధిస్తోందని అంచనా వేయగా, పంజాబ్ 42 శాతం గెలుస్తోందని ప్రిడిక్ట్ చేశారు.
ఇక సీజన్ లో ఫర్ ఫెర్మాన్స్ విషయానికి వస్తే.. ఆర్సీబీ మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడగా కేవలం రెండింటీలో మాత్రమే ఓడిపోయి.. మూడోస్థానంలో నిలిచింది. 10 పాయింట్లతో ఉంది. ఇక పంజాబ్ మాత్రం చిట్టచివరి స్థానంలో ఉంది. 7 మ్యాచులు ఆడితే.. మొక్కుబడిగా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో సరిపెట్టుకుంది.
బెంగళూరు జట్టు అన్నీ విభాగాల్లో సత్తా చాటుతోంది. అందరూ టీమ్గా ఆడటంతో విజయాలు సాధిస్తోంది. పంజాబ్ జట్టు కూడా సమిష్టిగానే ఆడుతోన్న.. వారిని విజయాలు వరించడం లేదు. కొద్ది పరుగుల తేడాతో పరాజయం పాలవుతోంది. మరీ ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తోంది చూడాలీ మరీ