సిద్దిపేటలో 1000 కిలోల గంజాయి పట్టివేత..!
సిద్దిపేట జిల్లా కేంద్రం వద్ద సుమారు వెయ్యి కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కాగా పట్టుపడిన గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి భద్రచలం మీదుగా జహిరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా దీని విలువ కోటి 92 లక్షల రుపాయాల విలువ ఉంటుందని తెలిపారు.కాగా ముందస్తు సమాచారం మేరకే ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో పెద్ద ఎత్తున నిషేధిత గంజాయిని భద్రచలం నుండి జహిరబాద్కు తరలిస్తున్నారని తెలిపారు. మొత్తం 962 కిలోల గంజాయిని 477 బ్రౌన్ కలర్ బ్యాగుల్లో కొబ్బరి కాయలతోపాటు జామ పండ్ల మాటున వీటిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. చట్టవిరుద్దంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరితోపాటు ట్రాన్స్పోర్ట్ వెహికిల్ను నడిపై డ్రైవర్ను సైతం అరెస్ట్ చేసినట్టు వారు తెలిపారు.
కాగా ఇటివల తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుపడడం ఇదే మొదటి సారి. దీంతో డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యు ఇంటలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల నిఘా ఏర్పాటు చేశారు.