న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెమీస్‌ బెర్తు ఖరారు: భారత్ చేతిలో చైనా చిత్తుగా ఓడింది

By Nageshwara Rao

హైదరాబాద్: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తుంది. టోర్నీలో భాగంగా మంగళవారం మలేసియాలోని విస్మా బెలియా హాకీ స్టేడియంలో చైనాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనను కనబర్చింది.

రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లో రూపిందర్‌ పాల్‌ సింగ్‌ సారథ్యంలోని టీమిండియా 9-0తో చైనాపై అద్భుత విజయం సాధించి సెమీస్‌‌లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ (10), మలేసియా (9) టాప్‌ 2 స్ధానాల్లో ఉన్నాయి.

ఆ తర్వాత పాకిస్థాన్‌ (6), కొరియా (4) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత హాకీ రెగ్యులర్ కెప్టెన్ పీఆర్‌ శ్రీజేష్‌ గాయం కారణంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. దీంతో కెప్టెన్సీ పగ్గాలు రూపిందర్‌ పాల్‌ సింగ్‌ స్వీకరించాడు.

 ACT hockey: India thrash China, enter semis

ఆట ఆరంభం నుంచే చైనాపై భారత ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా భారత ఫార్వర్డ్స్‌ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థిని గుక్కతిప్పుకోకుండా చేశారు. ఆట 9వ నిమిషంలో ఆకాశ్‌దీప్‌ సింగ్‌ మెరుపు వేగంతో గోల్‌ చేసి భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు.

ఆ తర్వాత పది నిమిషాల వ్యవధిలో యూసుఫ్‌ అఫాన్‌ గోల్‌ చేయడంతో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ షాక్‌ నుంచి చైనా కోలుకోకముందే 22వ నిమిషంలో జస్‌జీత్ సింగ్‌ మూడో గోల్‌ సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్‌ రూపిందర్‌ (25వ నిమిషం) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు.

ప్రథమార్దంలో టీమిండియా 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితీయార్ధంలో కూడా టీమిండియా చెలరేగి ఆడింది. మూడో క్వార్టర్‌లో టీమిండియా ఏకంగా నాలుగు గోల్స్‌ సాధించింది. 34వ నిమిషంలో నికిన్‌ తిమ్మయ్య గోల్‌తో భారత్ 5-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

ఒకానొక దశలో చైనాకు రెండు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత గోల్‌కీపర్‌ ఆకాశ్‌ చైనా ప్రత్యర్ధి ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకున్నాడు. ఇక 37, 39 నిమిషాల్లో లలిత ఉపాధ్యాయ, ఆకాశ్‌దీప్‌ సింగ్‌ చెరో గోల్‌ చేయడంతో భారత్ 7-0తో ముందంజ వేసింది.

ఆట చివర్లో భారత ఆటగాళ్లు యూసుఫ్‌ (40), జస్‌జీత్ (51) మరో రెండు గోల్స్‌ సాధించారు. దీంతో చైనాపై 9-0తో భారత్ విజయం సాధించి సెమీస్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించి, ఒకదానిని డ్రాగా ముగించింది.

Asian Champions Trophy Hockey 2016 Points Table

ర్యాంకు జట్టు ఆడినవి గెలిచినవి ఓడినవి డ్రా పాయింట్లు
1 భారత్ 4 3 0 1 10
2 మలేసియా 3 3 0 0 9
3 పాకిస్థాన్ 4 2 2 0 6
4 దక్షిణ కొరియా 3 1 1 1 4
5 చైనా 4 1 2 0 3
6 జపాన్ 4 0 4 0 0
Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X