కోల్కతా: మైదానంలో బంతి తగిలి యువ క్రికెటర్ అంకిత్ కేశ్రీ మృత్యు విషాదాన్ని మరిచిపోక ముందే మరో క్రికెటర్ గాయపడ్డాడు. రాహుల్ ఘోష్ అనే క్రికెటర్ మంగళవారంనాడు స్థానిక లీగ్ క్రీడలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.
రాహుల్ ఘోష్ తల ఎడమ వైపు గాయమైందని, రక్తం కారిందని, సిటి స్కాన్ జరిగిందని, రక్తం గడ్డ కట్టిన గుర్తులున్నాయని అంటున్నారు.
రాహుల్ ఘోష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఏడు, ఎనిమిది రోజులు తమ పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుందని వారు చెప్పారు. ఆ తర్వాత అతని పరిస్థితి గురించి చెప్పగలమని అన్నారు.
అండర్ 19 క్రికెట్లో భాగంగా ఆడుతున్న ఆటలో శుక్రవారం నాడు బెంగాల్ అండర్ 19 క్రికెట్ మాజీ సారథి అంకిత్ కేసరి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు కన్నుమూసిన విషయం తెలిసిందే.