న్యూఢిల్లీ: 'పాకిస్థాన్ చేతిలో ఓడి భారత సైనికుల్ని తల దించుకోనివ్వం. వంద శాతం గెలుస్తాం' యూరీ ఉగ్రదాడి అనంతరం భారత హాకీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ అన్న మాటలివి.
అన్నమాటను నిలబెట్టుకుంటూ మలేషియాలోని క్వాంటన్లో జరుగుతున్న ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించింది.
ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో 3-2 స్కోరుతో పాకిస్థాన్పై విజయం సాధించి టోర్నీలో భారత్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ఆరంభంలో 1-2 తేడాతో వెనకబడిన భారత్ ఆ తర్వాత వెంటనే పుంజుకుని 3-2తేడాతో విజయం సాధించింది.
భారత్ జట్టు తరఫున పర్దీప్ మోర్, రూపిందర్ పాల్ సింగ్, రమణదీప్ సింగ్ తలా ఓ గోల్ సాధించడంతో ఆట చివరలో భారత్ విజయం ఖాయమైంది.
కాగా పాకిస్థాన్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ ఇర్ఫాన్ చెరో గోల్ సాధించారు. మ్యాచ్ 22వ నిమిషంలో భారత ఆటగాడు రమన్దీప్ వెంటన్ మరో గోల్ చేశాడు.
దీంతో భారత్ 3-2 లీడ్ సాధించింది. ఈ స్కోర్ను చివరి వరకూ కాపాడు కోవడంతో పాకిస్థాన్పై భారత హాకీ జట్టు విజయం సాధించింది.