హైదరాబాద్: ఆస్ట్రేలియన్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన టెన్నిస్ స్టార్ రోహాన్ బోపన్న కెనడాకు చెందిన తన భాగస్వామి గాబ్రియేలా దాబ్రోస్కీతో క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ రెండో రౌండ్లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో లుకాస్ కుబాట్(పొలాండ్)-చన్ యంగ్ జాన్(తైవాన్)పై బోపన్న జోడీ విజయం సాధించింది.
ఒక గంట 16 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో బోపన్న జోడీ 6-4, 5-7, 10-3తో ప్రత్యర్థి జోడీపై విజయం సాధించింది. మ్యాచ్లో భాగంగా తొలి సెట్ను సునాయాసంగా గెలుచుకున్న బోపన్న జోడీ రెండో సెట్లో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. టై-బ్రేకర్గా మూడో సెట్ను సొంతం చేసుకుని క్వార్టర్స్లోకి ప్రవేశించారు.
జెహాంగ్-అలెగ్జాండ్రియా పియా లేదా సానియా మిర్జా-ఇవాన్ డోజింగ్లలో ఎవరు గెలిస్తే వారితో కార్టర్స్లో ఈ జోడీ తలపడనుంది. మరోవైపు భారత్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ ఇప్పటికే మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే.