మూడో టీ20కి రావాలని ఆమీర్ ఖాన్ని ఆహ్వానించిన కోహ్లీ
ఈ సందర్భంలో విరాట్ కోహ్లీ టీమిండియా జెర్సీని అమీర్ ఖాన్కు ఇచ్చి మూడో టీ20కి రావాలని ఆహ్వానించారట. కోహ్లీ కోరిక మేరకు ఆమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చారని, ఇరు జట్లకు చెందిన క్రికెటర్లు బస చేసిన హోటల్లోనే బస చేశారని, టీమిండియా క్రికెటర్లను కలిసనట్లు తెలుస్తోంది.
భారత్లో 19వ వేదిక ఉప్పల్ స్టేడియం
కోహ్లీ ఇచ్చిన జెర్సీ ధరించి మరి కొన్ని గంటల్లో ప్రారంభమయ్యే మూడో టీ20కి అమీర్ ఖాన్ హాజరయ్యే అవకాశం ఉంది. భారత్లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న 19వ వేదిక ఉప్పల్ స్టేడియం నిలిచింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉంది.
హైదరాబాద్లో శుక్రవారం భారీ వర్షం పడే అవకాశం
గత పది రోజులుగా హైదరాబాద్ను ముంచెత్తుతున్న వర్షాలు శుక్రవారం మ్యాచ్ను సాగనిస్తాడా? అన్న అనుమానం కూడా ఉంది. హైదరాబాద్లో శుక్రవారం భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ కూడా పేర్కొంది. గురువారం రాత్రి భారీ వర్షానికి స్టేడియం తడిసి ముద్దయింది.
టేబుల్ ఫ్యాన్లతో పిచ్ను ఆరబెడుతున్న మైదాన సిబ్బంది
గురువారం కూడా వర్షం రావడంతో ఉప్పల్ మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గగానే సిబ్బంది కవర్లు తొలగిస్తున్నారు. తేమ ఎక్కువగా ప్రదేశాల్లో సిబ్బంది టేబుల్ ఫ్యాన్లతో పిచ్ను ఆరబెడుతున్నారు. రాంచీలో జరిగిన తొలి టీ20కి వర్షం ఆటంకం కల్పించడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్కు 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. మరీ హైదరాబాద్ టీ20లో ఏం జరుగుతుందో చూడాలి.