హైదరాబాద్: ఇండిపెండెన్స్ కప్లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్లో తొలి మ్యాచ్ను చేజార్చుకున్న వరల్డ్ ఎలెవన్... రెండో మ్యాచ్లో విజయం సాధించింది. బుధవారం పాకిస్థాన్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిసీస్ను 1-1తో సమం చేసింది.
పాక్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఆమ్లా(72 నాటౌట్, 5 ఫోర్లు, 2సిక్స్లు) అజేయ హాఫ్ సెంచరీకి తోడు చివర్లో తిసార పెరీరా(47 నాటౌట్, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (43)తో పాటు బాబర్ అజామ్ (45), షోయబ్ మాలిక్ (39) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. వరల్డ్ ఎలెవన్ బౌలర్లలో బద్రీ, పెరీరా చెరో రెండు వికెట్లు తీశారు.
పాకిస్థాన్ నిర్దేశించిన 175 లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే వరల్డ్ ఎలెవన్ చేధించింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అద్భుత ప్రదర్శన చేసిన తిసార పెరీరాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిర్ణయాత్మక మూడో టీ20 శుక్రవారం లాహోర్ జరగనుంది.