హైదరాబాద్: భారత జట్టుతో జరిగే మూడు టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ టై ఎంపికయ్యాడు. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ స్థానంలో అతడు చోటు దక్కించుకున్నాడు. త్వరలో జరిగే యాషెస్ సిరీస్ కోసం కమిన్స్కు విశ్రాంతి కల్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో భారత్తో జరిగే మూడు టీ20ల సిరిస్కు ఆండ్రూ టైని ఎంపిక చేసింది. టీ20 స్పెషలిస్ట్ బౌలరైన ఆండ్రూ టై ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున 5 మ్యాచ్లు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో గుజరాత్ లయన్స్కు ఆడాడు.
అయితే ఆండ్రూ టై తొలి మ్యాచ్లోనే హ్యాట్రిక్ సాధించాడు. ఇదిలా ఉంటే భారత జట్టుతో మూడు టీ20ల సిరిస్ అక్టోబర్ 7న ప్రారంభం అవుతుంది. రాంచీ, హైదరాబాద్, గౌహతిలో ఈ టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి.