తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా లేఖ
మరోవైపు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలతో పాటు చాలా మంది సీనియర్ అధికారులు కుంబ్లే వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో కుంబ్లేనే కొనసాగిస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జూలైలో కోచ్గా కుంబ్లే బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ముగియనున్న కుంబ్లే పదవీ కాలం
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కుంబ్లే కోచ్ పదవీ కాలం ముగియనుంది. అయితే కుంబ్లే కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా 17 టెస్టుల్లో 12 విజయాలను సొంతం చేసుకుంది. టీమిండియాకు వరుస విజయాలనందించిన కుంబ్లేను పక్కనపెట్టేందుకు సీఏసీ కూడా విముఖంగానే ఉంది.
జూన్ 26న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)
మరోవైపు జూన్ 26న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) జరిగే వరకు కోచ్ వ్యవహారాన్ని వాయిదా వేయాలని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కుంబ్లే అటునుంచి అటే విండీస్ పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలుంటాయి.
కుంబ్లే వెళ్లకుంటే సహాయక కోచ్ సంజయ్ బంగర్
ఒకవేళ కుంబ్లే వెళ్లకుంటే సహాయక కోచ్ సంజయ్ బంగర్ జట్టుతో పాటు వెళతారు. నిజానికి కెప్టెన్ కోహ్లీ చెప్పాడని కుంబ్లేను మారిస్తే బోర్డు పరిపాలక వ్యవహారాల్లోనూ తన అభిప్రాయానికి విలువ ఉంటుందనే సంకేతాలు పంపించినట్టవుతుందని, ఇది సరైన నిర్ణయం కాదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పిన సీఓఏ
మరోవైపు కోచ్ ఎంపిక వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని పరిపాలక కమిటీ (సీఓఏ) తేల్చి చెప్పింది. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) నిర్ణయాన్ని తాము వ్యతిరేకించలేమని, మా నుంచి ఎలాంటి జోక్యం ఉండదని స్పష్టం చేసింది. ఏదైనా సీఏసీ నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు.