న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఆటతో రికార్డులు సృష్టించడమే కాదు తన పుస్తకంతో కూడా రికార్డు సృష్టిస్తున్నాడు. అత్యుత్తమ అమ్మకాలు జరిగిన పుస్తకంగా ఆయన స్వీయచరిత్ర(ఆటోబయోగ్రఫీ) నిలిచింది.
ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకంగా సచిన్ స్వీయ చరిత్ర 'ప్లేయింగ్ ఇట్ మై వే' లిమ్కా బుక్ రికార్డులో స్థానం సంపాదించింది.
సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితానికి సంబంధించి రచించిన పుస్తకం 'ప్లేయింగ్ ఇట్ మై వే'. సహ రచయితగా బోరియా మజుందర్ ఉన్నారు.
2014, నవంబర్ 6న ఈ పుస్తకాన్ని ముంబైలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పుస్తకం 1,50,289 కాపీలు అమ్ముడయ్యాయి. ఈ పుస్తకం రూ.13.51కోట్లు వసూలు చేసింది. దీని ధర రూ.899.