హైదరాబాద్: భారత సినిమా చరితర్లో సరికొత్త అధ్యయానికి నాంది పలికిన బాహుబలి చిత్రం సెగ భారత క్రికెటర్లనూ తాకింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రహానేలు క్రికెట్ అభిమానులకు టీమిండియా బాహుబలిని పరిచయం చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
టీమిండియా బాహుబలి ఉంటే చాలు చాలా సరదా సరదా అంటూ భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోతోపాటు వీడియో కూడా పోస్ట్ చేశాడు. ఇంతకీ ఈ బాహుబలి ఎవరని అనుకుంటున్నారా.. అతను మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తనయుడు జొరావర్.
లండన్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏర్పాటు చేసిన 'ఛారిటీ డిన్నర్' కార్యక్రమానికి రోహిత్ శర్మ, రహానేలు జోరావర్తో నడుచుకుంటూ వెళ్లినపుడు తీసిన ఫన్నీ వీడియోను రోహిత్ శర్మ తన ఇన్స్ట్రాగామ్లో పోస్టు చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తండ్రి శిఖర్తో కలిసి జట్టుతో ప్రయాణం చేస్తున్న జొరావర్.. తన అల్లరి, కొంటె పనులతో టీమిండియా ఆటగాళ్లలో సరికొత్త సరదాను జోష్ను నింపుతున్నాడు. రోహిత్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో రహానే చేయిపట్టుకుని జొరావర్ బస్సు ఎక్కడానికి వస్తున్నాడు.