న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్యుత్తమ భాగస్వామ్యం: ధోని-కోహ్లీల పేరిట ముంబైలో రెస్టారెంట్

మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు అత్యుత్తమ విజయాలనందించిన కెప్టెన్లు. వీరిద్దరి పేర్లు వింటే చాలు అభిమానులు సైతం జైజేలు పలుకుతారు. 
 తాజాగా, ముంబైలో 'ధోని-కోహ్లీ' పేరిట ఓ రెస్టారెంట్

By Nageshwara Rao

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు అత్యుత్తమ విజయాలనందించిన కెప్టెన్లు. వీరిద్దరి పేర్లు వింటే చాలు అభిమానులు సైతం జైజేలు పలుకుతారు. తాజాగా, ముంబైలో 'ధోని-కోహ్లీ' పేరిట ఓ రెస్టారెంట్ వెలిసింది. అయితే ఈ రెస్టారెంట్‌ను వీరు ప్రారంభించకపోవడం విశేషం.

వీరి పేర్లతో డబ్బుని క్యాష్‌ చేసుకునేందుకు ఈ పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది. ధోని, కోహ్లీల మీద ఉన్న అభిమానంతో ఓ వ్యాపారి వాళ్ల పేరుతో రెస్టారెంట్‌‌ని ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్‌ ముంబైలోని కాండీవలి ఈస్ట్‌ ప్రాంతంలో ఉంది. ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ క్రికెట్‌ విశ్లేషకుడు మోహన్‌దాష్ మేనన్‌ తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ధోని, కోహ్లీలు న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరిస్‌పై దృష్టి సారించారు. ముంబైలోని వాంఖడేలో ఆదివారం భారత్‌-కివీస్‌ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ కోహ్లీకి 200వ వన్డే కావడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X