హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతోన్న తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 38 ఓవర్లకు గాను 162 పరుగులు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
హాసన్ అలీ బౌలింగ్లో సర్ఫరాజ్ అహ్మద్కి క్యాచ్ ఇచ్చి అవుటైన ఇయాన్ మోర్గాన్ 33 పరుగులు సాధించాడు. దీంతో అతను తన వన్డే కెరీర్లో ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. ఇంగ్లాండ్ తరఫున ఐదువేలకు పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా మోర్గాన్ నిలిచాడు.
అంతకముందు ఇయాన్ బెల్(5,416), కోలింగ్వుడ్(5,092) ఐదు వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఇరు జట్లకి ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీని గెలవలేదు.
An elite club!@Eoin16 passes 5,000 ODI runs for @englandcricket - only the 3rd batsman to do so! 🙌#ENGvPAK #CT17 pic.twitter.com/5kgjUiFjqz
— ICC (@ICC) June 14, 2017