ఛాంపియన్స్ టోర్నీకి దూరమైతే
అయితే దీనివల్ల బీసీసీఐకి నష్టం జరిగిన మాట వాస్తవమేగా ఛాంపియన్స్ టోర్నీకి దూరమైతే ప్రపంచ క్రికెట్లో భారత్ ఒంటరయ్యే ప్రమాదముందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను ప్రకటించే తుదిగడువు (ఏప్రిల్ 25) ముగిసినప్పటికీ బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు జట్టును ఎంపిక చేయలేదు.
390 మిలియన్ డాలర్లు ఇస్తామని ముందుకొచ్చిన ఐసీసీ
ఇక కొత్త ఫార్ములా ప్రకారం 293 మిలియన్ డాలర్లతోపాటు అదనంగా మరో 100 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐసీసీ ముందుకొచ్చింది. వర్కింగ్ గ్రూప్ కూడా ఓటింగ్కు ముందు బీసీసీఐ ప్రతినిధి అమితాబ్ చౌదరితో సమావేశమై మొత్తం 390 మిలియన్ డాలర్లు ఇస్తామని అధికారికంగా ప్రతిపాదించింది.
450 మిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరిన బీసీసీఐ
అయితే ఐసీసీ పరిపాలనలో ఎలాంటి మార్పులు చేయకుండా 450 మిలియన్ డాలర్లు ఇవ్వాలని బీసీసీఐ కోరుతోంది. ఒకవేళ 450 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఒప్పుకుంటే మా బోర్డును ఒప్పిస్తామని అమితాబ్ చౌదురి అంతర్జాతీయ కౌన్సిల్కు చెప్పారు. కానీ మనోహర్ దీనికి ఒప్పుకునే స్థితిలో లేడని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
మిగతా దేశాలతో పోలిస్తే భారత్కే ఎక్కువ
కొత్త ఆదాయ పంపిణీ పద్ధతితో బీసీసీఐ ఆదాయానికి భారీగా కోత పడినా.. మిగతా దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్కే ఎక్కువ వాటా అందనుంది. బిగ్-3 ఫార్ములా ప్రకారం ఎనిమిదేండ్ల కాలానికి బీసీసీఐకి 570 మిలియన్ డాలర్లు వచ్చేవి. కానీ కొత్త విధానం ప్రకారం ఇప్పుడు 293 మిలియన్ డాలర్లు ఆదాయం మాత్రమే వస్తున్నా.. మిగతా దేశాల కంటే ఇది చాలా ఎక్కువ.
ఏడు సభ్య దేశాలకు ఒక్కొక్కరికి 132 మిలియన్ డాలర్లు
ఇంగ్లండ్కు 143 మిలియన్ డాలర్లు, జింబాబ్వేకు 94 మిలియన్ డాలర్లు, మిగతా ఏడు సభ్య దేశాలకు ఒక్కొక్కరికి 132 మిలియన్ డాలర్ల చొప్పున ఆదాయం సమకూరనుంది. జింబాబ్వేకు అత్యల్పంగా 94 మిలియన్ డాలర్లు దక్కనుండగా.. మిగతా బోర్డులకు 132 మిలియన్ డాలర్ల చొప్పున లభించనున్నాయి.