గ్రూప్ బీలోని అన్ని జట్లు తలో మ్యాచ్ నెగ్గాయి
తాజాగా శ్రీలంక విజయం సాధించండంతో గ్రూప్ బిలో భాగంగా భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కు పోరు రసవత్తరంగా మారింది. భారత్ తమ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
చావో రేవోగా మారిన మిగతా రెండు మ్యాచ్లు
కాగా, గ్రూప్ బీలో భాగంగా జరగాల్సిన రెండు మ్యాచ్లు ఆయా జట్లకు చావో రేవోగా మారాయి. టోర్నీలో భాగంగా జూన్ 11 (ఆదివారం)న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, జూన్ 12 (సోమవారం) పాకిస్థాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
గ్రూప్ స్టేజికి సోమవారం చివరి రోజు
గ్రూప్ స్టేజిలో భాగంగా జరిగే మ్యాచ్లకు సోమవారం చివరి రోజు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మిగతా మూడు జట్లతో పోలిస్తే మెరుగైన రన్ రేట్ను కలిగి ఉంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే భారత్ 3 పాయింట్లతో సెమీస్కు అర్హత సాధిస్తుంది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే
అదే విధంగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయితే దక్షిణాఫ్రికాకు ఎంతో మేలు చేస్తోంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్కు అర్హత సాధిస్తుంది. గ్రూబ్ బీలో భారత్ 2 పాయింట్లతో పాటు +1.272 నెట్ రన్ రేట్తో అగ్రస్ధానంలో ఉంది.
మిగతా మూడు జట్లూ 2 పాయింట్లతో
మరోవైపు మిగతా మూడు జట్లు కూడా 2 పాయింట్లతో కొనసాగుతున్నప్పటికీ నెట్ రన్ రేట్లో వెనుకబడి ఉన్నాయి. దక్షిణాఫ్రికా +1.000 రన్ రేట్తో కొనసాగుతుండగా, శ్రీలంక -0.879 ఆ తర్వాత పాకిస్థాన్ -1.544తో కొనసాగుతోంది. అయితే ఈ రెండు మ్యాచ్ల్లో ఫలితం వస్తే మాత్రం ఈ నెట్ రన్ రేట్ లెక్కలు అవసరం లేదు.