న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో ఓటమిని తట్టుకోలేక స్కోరు బోర్డు హైజాక్

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం స్కోరు బోర్డు హైజాక్‌కు గురైంది. నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (235), మురళీ విజయ్ (136), జయంత్ యాదవ్ (105) వీరవిహారంతో భారత్ 631 భారీ స్కోరుకు దూసుకెళ్లింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 231 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాడ్ 182 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

దీంతో చివరి రోజు ఇంగ్లాండ్ 49 పరుగులు వెనుకబడి ఉంది. ఇంతలో ఇంగ్లాండ్ అభిమానులు స్కోరు బోర్డుని హైజాక్ చేసి కలకలం రేపారు. అసభ్యకర మెసేజ్‌లు గుప్పించడం మొదలుపెట్టారు. ''భారత గడ్డపై క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ లాగులు తడిపేసుకుంటోంది'' అంటూ మెసేజ్ ప్రత్యక్షం కావడంతో ఇరువైపు క్రికెటర్లు అవాక్కయ్యారు.

Cricket: England fans hijack scoreboard in India

ఆ తర్వాత వరుసగా ఇంగ్లాండ్ క్రికెటర్లపై అసభ్యకరంగా మెసేజ్‌లు వస్తుండటంతో స్టేడియంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆడమ్ జాన్సన్, మెడిలిన్ మెక్‌కాన్, ఎలిజబెత్ ఫ్రిజిల్‌తో పాటు రాజకీయ ప్రముఖుడు బ్రెగ్జిట్ ప్రచారకర్త నైజిల్ ఫరేజ్‌పై ఇంగ్లాండ్ అభిమానులు అభ్యంతరకర సందేశాలు పోస్టు చేశారు.

దీంతో వెంటనే ఈ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరోవైపు క్రీడా స్ఫూర్తిని కోల్పోయి ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం తగదంటూ ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X