బెర్ముడాలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ కుస్తీ-క్విక్ బాక్సింగ్ను తలపించింది. 2015 ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్లో ఫైనల్ మ్యాచ్లో భాగంగా సెప్టెంబర్ 12 (శనివారం)న క్లీవ్ల్యాండ్ కంట్రీ క్రికెట్ క్లబ్, విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ల జట్ల మధ్య చోటు చేసుకుంది.
ఇరు జట్లకు చెందిన క్రికెటర్లు బ్యాట్లతో ఒకరిపై మరొకరు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. ఈ కొట్లాటకు కారణమైన జాన్సన్ ఆండ్రన్ (36) అనే వికెట్ కీపర్పై జీవితకాల నిషేధం విధించారు. బెర్ముడా జట్టు తరుపున జాన్సన్ ఆండ్రన్ 5 వన్డేలు, 9 ట్వంటీ20లకు ప్రాతినిధ్యం వహించారు.
జాన్సన్ ఆండ్రన్ తన ప్రత్యర్ధి జట్టులో ఉన్న జార్జి ఓ బ్రెయిన్పై కొట్లాటకు దిగాడు. మైదానంలో చిన్న చిన్న మాటలతో ప్రారంభమైన వీరి గొడవ క్విక్ బ్యాకింగ్కు దారి తీసింది. ఈ గొడవ పోలీసులు, అధికారులు కలగజేసుకుని ఆపే వరకూ వెళ్లింది.
ఈ ఫైనల్ మ్యాచ్ని అంపైర్లు, అధికారులు మధ్యలోనే నిలిపివేసి జాన్సన్ ఆండ్రన్ను మైదానం నుంచి బయటకు పంపివేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్లో క్లీవ్ల్యాండ్ కంట్రీ క్రికెట్ క్లబ్ 72 పరుగులతో విజయం సాధించింది.
మ్యాచ్లో గొడవకు కారణమైన మరో బ్యాట్స్మెన్ ఓ బ్రెయిన్ బెర్ముడా జట్టు తరుపున 9 వన్డేలు, 3 ట్వంటీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్రెయిన్ లెవెల్ 3 ఉల్లంఘనకు పాల్పడ్డారు. 50 ఓవర్ల మ్యాచ్లో ఓ బ్రెయిన్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ గొడవ చోటు చేసుకుంది.