నాకు, రూట్కు తప్ప ఎవరికీ అనుభవం లేదు
'అయితే టాప్ ఆర్డర్లో నాకు, రూట్కు తప్ప ఎవరికీ ఒకట్రెండు మ్యాచ్లకు మించిన అనుభవం లేదు. అదే రెండు జట్లలో తేడా. అయినా గత రెండు మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శనే చేశాం. మొహాలి పిచ్ను తప్పుగా అంచనా వేశాం. లేదంటే నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడేవాళ్లం. ఈ పిచ్ స్పిన్కు బాగా సహకరిస్తుందనుకున్నాం' అని కుక్ అన్నాడు.
మొహాలి పిచ్ను అంచనా వేయడంలో విఫలం
మొహాలి పిచ్ను తమ బ్యాట్స్మెన్ అంచనా వేయడంలో విఫలమయ్యారని చెప్పాడు. అదే తమ ఓటమికి ఓ కారణమని కుక్ అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ముంబై పిచ్ను జాగ్రత్తగా పరిశీలిస్తామని చెప్పుకొచ్చాడు. భారత్ దూకుడుకి అడ్డుకోవాలంటే నాలుగో టెస్టులో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగుతామన్నాడు.
ఇంగ్లాండ్ జట్టులో రాణించిన రషీద్
ఇక లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఈ టెస్టులో ఐదు వికెట్లతో రాణించగా, సీనియర్ స్ఫిన్నర్ బ్యాటీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాడు. ఇదే స్టేడియంలో గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 20 వికెట్లకుగానూ 19 వికెట్లు స్పిన్నర్లే తీసి భారత విజయంలో కీలక పోషించారని అలెస్టర్ కుక్ గుర్తుచేశాడు.
నాలుగో టెస్టులో వ్యూహం మార్చుతాం
ఐదు వికెట్ల ఇన్నింగ్స్తో బెన్ స్టోక్స్ రాణించడం ఒక్కటే తమకు ప్లస్ పాయింట్ అన్నాడు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహంతో ఇప్పటివరకూ ఆడామని కానీ నాలుగో టెస్టులో మరో స్పిన్నర్కు అవకాశం కల్పించి భారత్ను త్వరగా ఆలౌట్ చేస్తే తమకు విజయావకాశాలు ఉంటాయని కుక్ చెప్పాడు.