మూడో స్ధానంలో అనిల్ కుంబ్లే
కుంబ్లేపై తనకున్న గౌరవాన్ని ఈ సందర్భంగా అశ్విన్ ప్రదర్శించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే మూడో స్ధానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీ ధరన్ అగ్రస్ధానంలొ కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్ధానంలో ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ ఉన్నాడు.
టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న సమయంలో
2016లో అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్గా నియమితులైన సమయంలో అతడితో కలిసి పని చేసే అవకాశాన్ని అశ్విన్ సొంతం చేసుకున్నాడు. కుంబ్లే కోచ్గా ఉన్న సమయంలో అశ్విన్కు ఎన్నో ఉపయోగకరమైన టిప్స్ను సైతం తెలియజేశాడు.
52 టెస్టులాడిన ఆశ్విన్ 292 వికెట్లు
31 ఏళ్ల అశ్విన్ ఇప్పటి వరకు భారత్ తరుపున 52 టెస్టుల్లో 292 వికెట్లు తీశాడు. తమ అభిమాని క్రికెటర్ల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 1998లో పాకిస్తాన్తో పెషావర్లో జరిగిన టెస్టులో ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా బ్రాడ్మన్ పట్ల ఇలాంటి గౌరవాన్నే చూపించాడు.
గతంలో ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా
ఆ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 334 పరుగులతో నాటౌట్గా నిలిచిన కెప్టెన్ టేలర్... తాను బ్రాడ్మన్ అత్యధిక స్కోరు (334)ను అందుకోవడమే గొప్ప అని, దానిని దాటలేనంటూ మూడో రోజు క్రీజులోకి రాకుండా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచాడు.