నాయర్ ట్రిపుల్ సెంచరీ
చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించిన అనంతరం అభివాదం చేస్తున్న కరుణ్ నాయర్. టెస్టుల్లో తొలిసెంచరీ సాధించిన సమయంలోనూ భావోద్వేగాలు ప్రదర్శించిన కరుణ్ నాయర్ డబుల్, ట్రిపుల్ మార్క్ చేరినా సాదాసీదా అభివాదంతో సరిపెట్టాడు.
నాయర్కు ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ అభినందన
ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ను ఇంగ్లాండ్ ఆటగాడు మెయిన్ అలీ అభినందిస్తున్న ఫోటో. చెన్నైలోని చెపాక్లో ఉన్న చిదంబరం స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగో రోజు ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
సెహ్వాగ్ తర్వాత రెండో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు
తన కెరీర్లో ఆడుతున్న మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అంతేకాదు టెస్టుల్లో సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సాధించిన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత బ్యాట్స్మన్గా నాయర్ చరిత్ర సృష్టించాడు.
నాయర్ను అభినందిస్తున్న జో రూట్
ట్రిపుల్ సెంచరీ చేసిన అనంతరం నాయర్ను అభినందిస్తున్న ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్. రాజస్థాన్లోని జోధ్పూర్లో మలయాళీ దంపతులకు డిసెంబర్ 6, 1991న కరుణ్ నాయర్ జన్మించాడు. మొదట అతను కర్ణాటక తరఫున అండర్-15 క్రికెట్ ఆడాడు. అనంతరం కర్ణాటక నుంచే అండర్ 19 జట్టులో చోటు సాధించాడు.
నాయర్ను అభినందిస్తున్న అలెస్టర్ కుక్
ట్రిపుల్ సెంచరీ చేసిన అనంతరం నాయర్ను అభినందిస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్. టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్ (365 నాటౌట్), బాబ్ సింప్సన్ (311)ల తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చిన మూడో క్రికెటర్ నాయర్.
ట్రిపుల్ సెంచరీ వీరుడికి టీమిండియా అభినందన
ఇంగ్లాండ్తో చెన్నైలో జరుగుతున్న ఐదో టెస్టు నాలుగో రోజున కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్కు టీమిండియా క్రికెటర్లు లేచి నిల్చుని అభివాదం తెలుపుతున్న దృశ్యం. ట్రిపుల్ సెంచరీ అనంతరం టీమిండియా 759 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.