హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఉన్న కనెక్షన్ ఏపాటితో మనందరికీ తెలిసిందే. అయితే టీమిండియా ది వాల్ గా పిలుచుకునే రాహుల్ ద్రవిడ్, అనుష్క శర్మల మధ్య కొన్నేళ్ల కిందట ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
మొట్టమొదటిసారి రాహుల్ ద్రవిడ్ను కలుసుకున్న సందర్భంగా ఎదురైన ఓ అనుభవాన్ని అనుష్క శర్మ స్వయంగా వెల్లడించింది. 'నేను అప్పటికి అంత పాపులర్ కాదు. ఏదో పనిమీద రాహుల్ ద్రవిడ్ బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియానికి వచ్చాడు. నా సోదరుడు కర్ణేశ్ పుస్తకం, పెన్ను తీసుకుని ఆటోగ్రాఫ్ కోసం ద్రవిడ్ వద్దకు వెళ్లాను' అని పేర్కొంది.
అనుష్కతో ఎంగేజ్మెంట్ వార్తలపై కోహ్లీ ఆగ్రహం: ట్విట్టర్లో స్పందన
'ఆయన అడిగిన వెంటనే పెన్ను, బుక్ ఇచ్చాను. నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చిన వెంటనే ద్రవిడ్ చుట్టూ ఎంతోమంది ఆటోగ్రాఫ్ కోసం చుట్టుముట్టారు. ఆయన ఎవరినీ నొప్పించకుండా తన పెన్నుతో ఆటోగ్రాఫ్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. దాంతో కొద్దిసేపు అక్కడే వెయిట్ చేశాను. ఇక ఓపిక నశించిపోయి ద్రవిడ్ వద్దకు వెళ్లి తన పెన్ను తిరిగి ఇచ్చేయమని అడిగాను. దీంతో క్రికెటర్తో పాటు అక్కడున్న వారు షాకయ్యారు' అని అనుష్క వెల్లడించింది.
అయితే ఆ తర్వాత అక్కడున్న వారు తేరుకుని నవ్వుకున్నారని ద్రవిడ్ను తొలిసారిగా కలిసిన సందర్భంగా జరిగిన విషయాన్ని అనుష్క వివరించింది. రాష్ట్ర స్థాయి ఆటగాడైన కర్ణేశ్ ప్రస్తుతం మూవీ ప్రొడక్షన్ సంస్థకు సహవ్యవస్థాపకుడిగా ఉన్నారు. చెల్లి అనుష్కతో కలిసి ఆ ప్రొడక్షన్ హౌస్లో ఎన్హెచ్ 10 సినిమాని నిర్మించాడు.