ఇంగ్లాండ్లో పిచ్లు కాస్తంత భిన్నం
నిజానికి ఇంగ్లాండ్లో పిచ్లు కాస్తంత భిన్నంగా ఉంటాయి. ఛాంపియన్స్ టోర్నీ ఆరంభం నుంచీ అక్కడ భారీగా వర్షాలు పడటంతో ఐసీసీ నిర్వాహకులు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలో
ఛాంపియన్స్ ట్రోఫీలో టాస్ గెలవగానే అన్ని జట్లు ఫీల్డింగ్కే మొగ్గు చూపిస్తున్నాయి.
టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ
అయితే ఇదే వ్యూహంతో కోహ్లీ కూడా టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడని అంటున్నారు. ఇదే టీమిండియా ఓటమికి కారణమైందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండురోజులుగా లండన్లో వర్షం లేదు. ఆదివారం ఉదయం నుంచి ఎండ ప్రభావం కనిపించింది.
పిచ్ విషయానికి వస్తే ఫ్లాట్గా, పొడిగా
కానీ ఎక్కువశాతం పొడిగానే ఉండే అవకాశం ఉంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఫ్లాట్గా, పొడిగా ఉంది. ఇలాంటి పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకోవడం జట్టుకు తీరని నష్టం చేసింది. అదే టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో ఏం జరిగింది
నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసే ఆ జట్టుపై 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే భారీస్కోరు కాకపోయినా కనీసం 260, 270 పరుగులు చేసినా ఫలితం ఉండేది.
పాక్ ఒత్తిడికి లోనయ్యేది
ఇటీవల కాలంలో నిలకడలేమితో ఉన్న పాకిస్థాన్ ఆ స్కోరుని కూడా చేధించలేక ఒత్తిడికి లోనయ్యేది. నిజానికి టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో అదే జరిగింది. ఛేదనల్లో బాగా తడబడుతుందన్న పేరు పాకిస్థాన్కు ఉంది. ఆదివారం నాటి మ్యాచ్లో కోహ్లీ మన బలాన్ని నమ్ముకోకుండా, పరిస్థితులకు తగ్గట్లు వెళ్లాలడమే భారత్ ఓటమికి కారణమైంది.