హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడానికి తమ మాజీ కెప్టెన్ కుమార సంగక్కర చేసిన సూచనలేనని కారణమని ఆ జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ చెప్పాడు. ది ఓవల్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
భారత్పై అన్ని రంగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక, సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాథ్యూస్ మీడియాతో మాట్లాడాడు. భారత్తో జరిగిన మ్యాచ్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగామని, ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు.
మ్యాచ్కు రెండు రోజుల ముందు సంగక్కర యువ ఆటగాళ్లకు బ్యాటింగ్లో మెళుకవలు సూచించాడని, వాటిని యువ ఆటగాళ్లు అమలుపరిచారని అదే గెలుపుకు కారణమైందని మాథ్యూస్ అన్నాడు. కుసాల్ మెండీస్(89) రాణించడానికి సంగక్కర బ్యాటింగ్ సూచనలే కారణమని చెప్పాడు.
Is there anyone better to get batting advice from? #CT17 pic.twitter.com/XQ7ZgB5mNS
— ICC (@ICC) June 8, 2017
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో ఓటమితో ఒత్తిడిలో ఉన్నతాము భారత్తో మ్యాచ్ గెలుస్తామనుకోలేదని అన్నాడు. కానీ సాయశక్తుల పోరాడాలని, స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు మాథ్యూస్ తెలిపాడు. స్వేచ్ఛగా దూకుడుగా ఆడామని అదే భారత్పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిందని మాథ్యూస్ చెప్పాడు.
గత కొద్దీ కాలంగా విజయాలు లేని మాకు ఈ విజయం ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నాడు. తొడ నరాలు పట్టుకొని బాధపడుతున్న కుసాల్ పెరారా(47)ను కెప్టెన్గా రిటైర్డ్ హాట్గా పంపిచానని, ఆసమయంలో ఫలితం గురించి ఆలోచించలేదని తెలిపాడు.
Kusal Perera has reitred hurt on 47 off 44.
— ICC (@ICC) June 8, 2017
Will new man Asela Gunaratne guide Sri Lanka home?
LIVE: https://t.co/3VzGviqIok #INDvSL #CT17 pic.twitter.com/mvesqQ2hQ1
ఫలితం వేరేలా ఉంటే నాపై విమర్శలు వస్తాయని తెలుసని, కానీ కఠిన పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్కు ఎప్పుడో వీడ్కోలు పలికిన సంగక్కర ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీల్లో సర్రేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇంగ్లాండ్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండటంతో అక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న కుమార సంగక్కర.. తన స్వదేశానికి చెందిన జట్టుకు సలహాలు, సూచనలు అందించాడు. సంగక్కర చేసిన సూచనలు, సలహాలను మ్యాచ్లో అమలు చేశామని మాథ్యూస్ చెప్పుకొచ్చాడు.
It's going to the wire!
— ICC (@ICC) June 8, 2017
Sri Lanka require 51 from 42
Follow #INDvSL LIVE!https://t.co/3VzGviqIok #CT17 pic.twitter.com/XcdBXab5Tz
తాజా విజయంతో సెమీస్ రేసులో ఉన్నామని, సోమవారం పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో కూడా ఇదే ప్రణాళిక అమలు చేస్తామని కెప్టెన్ మాథ్యూస్ పేర్కొన్నాడు. గెలుపుపై ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతామని మాథ్యూస్ పేర్కొన్నాడు.