లబ్ది పొందాలనుకునే వారికి ఇదే నా హెచ్చరిక
‘లబ్ది పొందాలనుకునే వారికి ఇదే నా హెచ్చరిక. అనిశ్చితి చిరకాలం ఉండదు. అతిత్వరలో బీసీసీఐ మునుపటి ప్రభను సంతరించుకుంటుంది. అందుకే తన చేతిలో ఉన్న దానిపై బోర్డు ఒత్తిడి పెంచాలి' అని రవిశాస్త్రి సూచించాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా బోర్డులను ఉద్దేశించే రవిశాస్త్రి ఇలాంటి హెచ్చరికలు చేసినట్టుగా తెలుస్తోంది.
బోర్డుకు మద్దతుగా నిలిచిన శాస్త్రి
ఐసీసీ ఆదాయంలో సింహ భాగం కావాలనే బోర్డు డిమాండ్ను శాస్త్రి సమర్ధించాడు. ‘దుబాయ్లో ఐసీసీ సమావేశాలకు వెళ్లిన బీసీసీఐ ప్రతినిధులు.. వాస్తవాలను ఐసీసీ దృష్టికి తీసుకెళ్లడంలో సమర్థంగా వ్యవహరించారు. ఐసీసీ టోర్నీల నుంచి వచ్చే ప్రతీ రూపాయి పైనా హక్కుంది. భారత ప్రపంచ క్రికెట్ను ఆకర్షించగలదు' అని అన్నాడు.
80 శాతం ఆదాయం భారత్ నుంచే వస్తుంది
‘ఐసీసీ టోర్నీలకు సంబంధించిన సుమారు 80 శాతం ఆదాయం భారత్ నుంచే వస్తుంది. అధిక వాటా అడుగుతున్నారు కాబట్టి భారత దౌర్జన్యం చేస్తుందని అంటున్నారా? అలాగైతే నా దృష్టిలో అంతకంటే చెత్త మరొకటి ఉండదు. బీసీసీఐ ఏమీ 80 శాతం ఆదాయం ఆడగడం లేదు. చాలా తక్కువ మాత్రమే ఇవ్వాలంటోంది. భారత నుంచి వచ్చే ఆదాయాన్ని మినహాయిస్తే.. ఎంత మిగులుతుందో చూడాలని ఉంది' అని రవిశాస్త్రి అన్నాడు.
అన్ని దేశాలతో పోలిస్తే భారత్కే ఎక్కువ వాటా రావాలి
అయితే ఐసీసీకి ఎక్కువ నిధులు అందిస్తున్న భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులను బిగ్ త్రిగా లెక్కలోకి తీసుకుని ఎక్కువ నిధులు అందించాలని గతంలో బీసీసీఐ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్కు అన్ని దేశాలతో పోలిస్తే ఎక్కువ వాటా దక్కనుంది.
బీసీసీఐకి మద్దుతుగా నిలిచిన శ్రీలంక
ఐసీసీ అండతో ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు ఒక్క శ్రీలంక తప్ప మిగతా అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమలో బీసీసీఐకి మద్దుతిచ్చిన శ్రీలంకను రవిశాస్త్రి అభినందించాడు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్, జింబాబ్వే ఐసీసీ పక్షం వహించడం నిరాశకు గురి చేసిందని చెప్పాడు. తాను ఈ స్థితిలో ఉన్నానంటే బీసీసీఐ ఇచ్చిన అవకాశాల వల్లేనని చెప్పుకొచ్చాడు.