దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్లో టాప్ టెన్లో భారత బ్యాట్స్మెన్కు చోటు దక్కలేదు. ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్లో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, రవీంద్ర జడేజా ఐదో స్థానానికి ఎగబాకాడు.
బౌలర్లలో మాత్రం అశ్విన్ రెండో స్థానాన్ని, జడేజా ఎనిమిదో స్థానాన్ని పొందారు. కానె విలియమ్స్ టాప్ స్పాట్కు రెండు మెట్లు మాత్రమే దిగువన ఉన్నాడు. డునేదిన్, హోబార్ట్ టెస్టులు ముగిసిన తర్వాత ఈ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి.
కానె విలియమ్స్ మూడో స్థానానికి ఎగబాకాడు. బ్రెండ్ మెక్కుల్లం రెండు స్థానాలు ఎగబాకి 17వ స్థానం పొందాడు. శ్రీలంక ఆటగాడు అంజిలో మాథ్యూ ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్ నాడు.
బౌలర్లలో ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హాజిల్వుడ్ టాప్ టెన్లో చేరాడు. నాథన్ లియోన్ రెండు స్థానాలు ఎగబాకి 15వ స్థానం పొందాడు.