దిగ్గజాల తర్వాత సత్తా ఉన్న ప్లేయర్స్ వీళ్లే
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రికీ పాంటింగ్, జాక్వస్ కలిస్లాంటి దిగ్గజాలు రిటైరైన తర్వాత వారి స్థానాలను భర్తీ చేసే సత్తా ఉన్న ప్లేయర్స్ వీళ్లే అని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. అందుకు తగినట్లే ఈ నలుగురూ ప్రపంచ క్రికెట్లో సత్తా చాటుతున్నారు. అయితే కోహ్లీ తాజాగా ఫామ్ విషయంలో మిగతా ముగ్గురినీ వెనక్కి నెట్టేశాడు.
కోహ్లీతో పోటీపడిన జో రూట్
గతేడాది కోహ్లీతో పోటీపడిన జో రూట్ కూడా పుణెలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్ కోహ్లినేనని రూట్ కూడా తేల్చి చెప్పేశాడు. రన్ ఛేజింగ్లో కోహ్లీని మించిన మొనగాడు లేడని తేల్చి చెప్పాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ తన కెరీర్లో 27వ సెంచరీని నమోదు చేశాడు.
ఐదో వికెట్కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యం
ఇంగ్లండ్ నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కోహ్లీ-జాదవ్ల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఎక్కువ సమయం తన కొడుకు ఆల్ఫ్రెడ్తోనే గడుపుతా
ఇదిలా ఉంటే ఇటీవలే తండ్రి అయిన జో రూట్ ఎక్కువ సమయం తన కొడుకు ఆల్ఫ్రెడ్తోనే గడపాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అందుకే ఐపీఎల్ ఆడే అవకాశాన్ని సైతం వదులుకుంటున్నాడు. తన కెరీర్లోనే అద్భుతమైన ఫామ్లో ఉన్న రూట్తో ఒప్పందానికి అనేక జట్లు సంప్రదిస్తున్నప్పటికీ తాను అయిష్టత వ్యక్తం చేస్తున్నానని చెప్పాడు.
ఐపీఎల్లో ఆడే అవకాశం రావడం అదృష్టమే
‘ఐపీఎల్లో ఆడే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. ఐపీఎల్ ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. నా ఆటతీరు మెరుగవడానికి ఆ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది' అని జో రూట్ చెప్పాడు. ప్రస్తుతం తన కొడుకు ఆల్ఫ్రెడ్తో ఎక్కువ సమయం గడపాలని అన్నాడు. ఈ సమయంలో కుటుంబంతో ఉండడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదని, కాబట్టి ఐపీఎల్లో పాల్గొనడం లేదని జో రూట్ స్పష్టం చేశాడు.