న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs పాక్: ధావన్ పొగరు, యువీ రాజసం, ఫ్యాన్స్ సందడి (వీడియో)

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో మధ్యాహ్నాం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

2007 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత మళ్లీ భారత్-పాక్ జట్లు టైటిల్ పోరులో తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ అభిమానులు తమ తమ పనులను ఇప్పటికే చక్కబెట్టుకుని ఆ అద్భుత క్ష‌ణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇరు దేశాల్లో కూడా క్రికెట్ ఫీవర్ వచ్చేసింది.

India vs Pakistan, ICC Champions Trophy 2017 Final: Here is ICC Video

భారత్-పాక్ జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ రికార్డులకు ఎక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా 32.4 కోట్ల మంది ఈ మ్యాచ్ వీక్షించనున్నట్టు అంచనా వేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో అతి ఎక్కువమంది వీక్షించిన మ్యాచ్‌లలో ఇది మూడోది కాబోతోంది. 2011లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌ను 55.8 కోట్ల మంది వీక్షించారు.

అదే టోర్నీలో భారత్-పాక్ మధ్య జరిగిన సెమీస్ పోరును 49.5 కోట్ల మంది చూశారు. ఈ రెండే ఇప్పటి వరకు ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మూడోది కానుంది. ఈ హైటెన్షన్ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ ఐసీసీ ఓ థ్రిల్లింగ్ వీడియోను అభిమానుల కోసం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X