హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో మధ్యాహ్నాం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
2007 వరల్డ్కప్ ఫైనల్ తర్వాత మళ్లీ భారత్-పాక్ జట్లు టైటిల్ పోరులో తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ అభిమానులు తమ తమ పనులను ఇప్పటికే చక్కబెట్టుకుని ఆ అద్భుత క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇరు దేశాల్లో కూడా క్రికెట్ ఫీవర్ వచ్చేసింది.
భారత్-పాక్ జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ రికార్డులకు ఎక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా 32.4 కోట్ల మంది ఈ మ్యాచ్ వీక్షించనున్నట్టు అంచనా వేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో అతి ఎక్కువమంది వీక్షించిన మ్యాచ్లలో ఇది మూడోది కాబోతోంది. 2011లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ను 55.8 కోట్ల మంది వీక్షించారు.
అదే టోర్నీలో భారత్-పాక్ మధ్య జరిగిన సెమీస్ పోరును 49.5 కోట్ల మంది చూశారు. ఈ రెండే ఇప్పటి వరకు ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మూడోది కానుంది. ఈ హైటెన్షన్ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ ఐసీసీ ఓ థ్రిల్లింగ్ వీడియోను అభిమానుల కోసం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
IT'S #CT17 FINAL DAY!@TheRealPCB 🇵🇰 v @BCCI 🇮🇳
— ICC (@ICC) June 18, 2017
Who are you backing? #PAKvIND pic.twitter.com/uEeMn30iKt