|
అశోకవనం సందర్శించిన టీమిండియా
‘రావణుడు సీతను బంధించిన అశోక్వనం సందర్శనకు టీమిండియా వచ్చింది. శ్రీలంకలోని సీత ఎలియా గ్రామంలో ఈ వనం ఉంది' అని మహమ్మద్ షమీ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.
హనుమంతుడి పాద ముద్ర వద్ద భార్యతో
అలాగే వనంలో హనుమంతుడి పాద ముద్ర వద్ద భార్యతో కలిసి దిగిన ఫొటోను ఉమేశ్యాదవ్ తన ఫేస్ బుక్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.
ఎవరెవరు?
ఈ పర్యటనకు కుల్దీప్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ తమ కుటుంబ సభ్యులతో కలిసి అశోక వనాన్ని సందర్శించారు.
టెస్టు
మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-0తో టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య ఆగస్టు 20 నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డేల్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించనుంది.