పది లక్షల చెట్లను కాల్చడానికి ఓ అగ్గిపుల్ల చాలు
'ఈ రోజు నీవు బలవంతుడు కావచ్చు కానీ, నీ కంటే సమయం ఎంతో బలమైనదని గుర్తు పెట్టుకో' అని ఆమె పేర్కొంది. ఓ చెట్టు పదిలక్షల అగ్గిపుల్లలను అందిస్తుందని, అయితే పది లక్షల చెట్లను కాల్చడానికి ఓ అగ్గిపుల్ల చాలని భారీ డైలాగులని వదిలింది. కాబట్టి మంచిగా ఉండాలని, మంచి చేయాలని ఆమె పేర్కొంది.
పుణె యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకొంటుందా!
తన భర్త ధోనీని అవమానించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్ యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు సాక్షి ఈ వ్యాఖ్యలు చేసిందా? అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోనీ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
రెండేళ్ల పాటు సస్పెండ్
అయితే, ఆ జట్టు అధికారులపై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఐపీఎల్ నుంచి ఈ జట్టును రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ధోనీ పూణె తరఫున ఆడుతున్నాడు. అయితే, ఈ సీజన్లో పుణె యాజమాన్యం ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించి అతడి స్ధానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
ధోనిపై హర్ష్ గోయెంకా అనుచిత వ్యాఖ్యలు
అయితే ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభమైన తర్వాత పూణె టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు హర్ష్ గోయెంకా ధోనీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో చేసిన పోస్టులు కలకలం రేపుతున్నాయి.