న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: పాండే మెరుపులు, ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతాదే విజయం

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఢిల్లీ సొంత మైదానమైన ఫిరోజ్‌షా కోట్లాలో

By Nageshwara Rao

హైదరాబాద్: ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌‌కతా 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది. కోల్‌కతా ఆటగాళ్లలో మనీష్ పాండే (69), యూసప్ పఠాన్ (59) రాణించడంతో కోల్‌కతా విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు గ్రాండ్ హోమ్ (1), గౌతం గంభీర్ (14) పరుగులకే అవుటై నిరాశపరిచారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాబిన్ ఉతప్ప(4) కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే-యూసఫ్ పఠాలు జోడి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.

వీరిద్దరూ నాలుగో వికెట్కు 110 పరుగులు జోడించారు. చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి తొమ్మిది పరుగులు కావాల్సిన తరుణంలో తొలి రెండు బంతుల్లో పరుగులేమీ రాలేదు. క్రిస్ వోక్స్(3) పెవిలియన్‌కు చేరాడు. ఇక మూడో బంతిని సునీల్ నరైన్ సింగిల్ తీసి పాండేకు స్ట్రైకింగ్ ఇచ్చాడు. నాలుగో బంతిని పాండే సిక్స్‌గా మలచాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీసి విజయాన్ని అందించాడు.


కోల్‌కతా విజయ లక్ష్యం 169

ఫిరోజ్ షా కోట్ల వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయలక్ష్యం 169 పరుగులుగా నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్లు సంజూ శాంసన్(25 బంతుల్లో 39; 7 ఫోర్లు), శ్యామ్ బిల్లింగ్స్(17బంతుల్లో 21; 2 ఫోర్లు)లు చక్కటి ఆరంభాన్నిఅందించారు.

ఆ తర్వాత కరుణ్ నాయర్ (27 బంతుల్లో 21; 1 ఫోర్), శ్రేయాస్ అయ్యర్ (1 బంతుల్లో 26; 4 ఫోర్లు)పరుగులతో రాణంచారు. వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 17 ఓవర్ లో విశ్వరూపం ప్రదర్శించాడు.

మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్‌లో ఉమేశ్ చితక్కొట్టిన రిషబ్ మొత్తంగా 26 పరుగులు రాబట్టాడు. రిషబ్ పంత్ సాధించిన 38 పరుగుల్లో 26 పరుగులు ఒకే ఓవర్‌లో రావడం విశేషం. అనంతరం రిషబ్ పంత్ ఆరో వికెట్‌గా అవుటైన తరువాత ఢిల్లీ స్కోరు బోర్డులో వేగంగా తగ్గింది.

చివరి వరుస ఆటగాళ్లలో క్రిస్ మోరిస్ (9 బంతుల్లో 16; 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో కౌల్టర్ నైల్ మూడు వికెట్లు సాధించగా, వోక్స్, యాదవ్, నరైన్‌లకు తలో వికెట్ దక్కింది.

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఢిల్లీ సొంత మైదానమైన ఫిరోజ్‌షా కోట్లాలో జరుగుతుంది. ఈ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ తొలి మ్యాచ్‌లో ఓడినా.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించింది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలుపొందిన కోల్‌కతా మంచి ఊపు మీదుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

నదీం, కోరె అండర్సన్ స్థానంలో మహ్మద్ షమీ, మాథ్యూస్‌కి తుది జట్టులో ఢిల్లీ చోటు కల్పించగా, పేసర్ ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కౌల్టర్ నైల్‌కి కోల్‌కతా తుది జట్టులో చోటిచ్చింది.

ఢిల్లీ డేర్‌ డెవిల్స్:
సంజు శాంసన్, శ్యామ్ బిల్లింగ్స్, కరుణ్ నాయర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మాథ్యూస్, క్రిస్ మోరీస్, పాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్

కోల్‌కతా నైట్‌రైడర్స్:
సునీల్ నరైన్, గౌతమ్ గంభీర్, రాబిన్ ఉతప్ప, మనీశ్ పాండే, యూసఫ్ పఠాన్, సూర్య కుమార్ యాదవ్, కొలిన్, క్రిస్ వోక్స్, కుల్దీప్ యాదవ్, కౌల్టర్ నైల్, ఉమేశ్ యాదవ్

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X