తొలుత బ్యాటింగ్ చేసిన పూణె
వాంఖడె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత పూణె బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ను ముంబై బౌలర్ మెక్లెనగన్ వేశాడు. నాలుగో బంతిని సిక్సర్గా మలిచిన ధోనీ మంచి ఊపు మీద ఉన్నాడు. దాంతో బౌలర్ రెండు వైడ్లు వేసి ధోనిని విసిగించాడు. ఈ క్రమంలో ఐదో బంతిని స్టాండ్స్లో కొట్టాలన్న కసితో ధోని బ్యాట్ను బలంగా ఊపాడు.
ఆఖరి బంతిని సిక్స్గా మలచిన ధోని
అయితే పరుగులు రాలేదు. అయితే పిచ్ మధ్యలో వేసిన ఆఖరి బంతిని సరైన టైమింగ్లో అందుకున్న ధోనీ భారీ షాట్ ఆడాడు. దాంతో గాల్లోకి లేచిన బంతిని అందుకోవాలని ముంబై కెప్టెన్ రోహిత్శర్మ లాంగాఫ్లో పూణె డగౌట్ ముందు ఎగిరాడు. బంతి గమనం అంతకన్నా పైన ఉండటంతో డగౌట్లో కింద పడ్డాడు.
రోహిత్ వెన్నుముకకు గాయమయ్యేదే
రోహిత్ శర్మ పడే సమయంలో వెనక్కి చూసుకోవడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అలా వెనక్కి పడుంటే రోహిత్ వెన్నుముకకు గాయమయ్యేదే. అక్కడ పూణె జట్టు ఆటగాళ్లకు సంబంధించిన కూల్ డ్రింక్స్ డబ్బాలు, బ్యాట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ పడిన వెంటనే పక్కనే ఉన్న పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ దగ్గరకు వచ్చి పైకి లేపాడు.
బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ సమష్టిగా రాణించిన పూణె
ఈ మ్యాచ్లో 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి ఓటమి పాలైంది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సమష్టిగా రాణించిన పూణె ఈ సీజన్లో ముంబైపై మరో విజయాన్ని నమోదు చేసింది. లీగ్ దశలో రెండు సార్లు పుణె చేతిలో ఓటమి పాలైన ముంబైకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.