రషీద్ను రూ. 4 కోట్లకు
రషీద్ను రూ. 4 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
గతనెలలో బెంగుళూరులో జరిగిన వేలంలో 18 ఏళ్ల రషీద్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 10వ ఎడిషన్లో ఆప్ఘనిస్థాన్కు చెందిన ఐదుగురు ఆటగాళ్లు వేలం బరిలో నిలిస్తే, అందులో ఇద్దరు ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.
తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్గా నబీ గుర్తింపు
ఐపీఎల్ వేలంలో తొలుత ఆప్ఘనిస్థాన్ సీనియర్ ఆటగాడు మొహ్మద్ నబీని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 30లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్గా నబీ గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రషీద్ని కూడా హైదారాబాద్ జట్టే కొనుగోలు చేసింది.
జింబాబ్వే పర్యటనలో ఉన్న సమయంలో
కాగా, జింబాబ్వేతో వన్డే సిరిస్లో భాగంగా తాను హరారేలో ఉన్నానన్న రషీద్, ఐపీఎల్ వేలం జరిగే సమయానికి తాను గాఢ నిద్రలో ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే వేలంలో తన పేరు ఉండటంతో ఆప్ఘనిస్థాన్లోని నాన్గర్ ప్రావిన్స్లో ఉన్న తన తల్లి దండ్రులు వేలాన్ని వీక్షించేందుకు వేకువజామునే లేచి టీవీల ముందు కూర్చున్నారని రషీద్ తెలిపాడు.
ఐపీఎల్ బిడ్డింగ్ని వీక్షించా
తాను గాఢ నిద్రలో ఉన్న సమయంలో తన పేరు బిడ్డింగ్కు వస్తుందన్న విషయాన్ని వారే ఫోన్ చేసి చెప్పారన్నాడు. నిద్రమత్తులో ఉన్న తాను అలానే ఐపీఎల్ బిడ్డింగ్ని వీక్షించినట్లు చెప్పుకొచ్చాడు. 'జింబాబ్వే సిరీస్లో తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకలేదు. ఆ క్రమంలోనే నేను సోమవారం నిద్రమత్తులో ఉన్నా. ఐపీఎల్ వేలం జరుగుతుందనే విషయం తెలుసు. కానీ బాగా అలసటగా ఉండి అలానే పడుకున్నా' అని రషీద్ చెప్పాడు.