హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్ వేదిక మారనుందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా డిసెంబర్ 16 నుంచి 20 వరకు ఇరు జట్ల మధ్య చెన్నైలోని ఎమ్ఎ చిదంబరం స్టేడియం వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.
అయితే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. జయలలితకు మధుమేహం ఉండటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
జయ ఆరోగ్యం, అపోలో హెల్త్ బులిటెన్స్ ఇవే: నమ్మచ్చా ?
ఈ మేరకు అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో విడుదల చేసిన బులిటెన్లో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జయలలితకు గుండె పోటు వచ్చిందని, ప్రస్తుతం ఎక్మో (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్)తో పాటు ఇతర లైఫ్ సపోర్ట్ సిస్టంల మీద ఉన్నారని అందులో పేర్కొంది.
దీంతో హృద్రోగ, శ్వాసకోశ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఆ బులెటిన్లో పేర్కొంది. అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ పేరు మీద ఈ బులెటిన్ విడుదలైంది. మరోవైపు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇలాంటి సమయంలో చెన్నైలో జరగనున్న టెస్టు మ్యాచ్కి సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తుందనే కారణంతో టెస్టును వేరొక వేదికకు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీసీసీఐ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం.
షాక్: జయ పరిస్థితి చాల విషమంగా ఉంది: మొదటి సారి అపోలో
కాగా, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇంగ్లాండ్పై 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. డిసెంబర్ 8 (గురువారం)నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే ప్రారంభం కానుంది. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో నాలుగో టెస్టులో సాహా స్ధానంలో పార్ధీవ్ పటేల్ చోటు దక్కించుకున్నాడు.