న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిస్ అవుతున్నా: ఐపీఎల్‌కు వసీం అక్రం దూరం

పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం ఐపీఎల్)-201 సీజన్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ప్రాంఛైజీగా ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు వసీం అక్రం బౌలింగ్ కోచ్.

By Nageshwara Rao

హైదరాబాద్: పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం ఇండియన్ ప్రీమయర్ లీగ్ (ఐపీఎల్)-2017 సీజన్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ప్రాంఛైజీగా ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు వసీం అక్రం బౌలింగ్ కోచ్, మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ముందే కమిట్ అయిన కొన్ని కార్యక్రమాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్-2017 సీజన్‌కు తాను అందుబాటులో ఉండనని నిర్వహకులకే ఇప్పటికే అక్రం తెలిపాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టును మిస్సవుతున్నానని, ఈ జట్టు ఎంతో ప్రతిభగలదని జట్టుకు అక్రం శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఎండీ, సీఈఓ వెంకీ మైసూర్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొన్నేళ్లుగా జట్టుకు విశేష సేవలందించిన అక్రం సేవలను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మిస్ అవుతుందని తెలిపాడు.

2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టైటిల్‌ గెలిచిందని, ఆ సమయంలో అక్రం జట్టుకు అందించిన సేవలను ఎప్పటికి మరిచిపోలేమని పేర్కొన్నాడు. ఇక అక్రం సైతం తాను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ని మిస్ అవుతున్నట్లు పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ 2017 సీజన్ ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమై మే 26న ముగియనుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X