హైదరాబాద్: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీసేన న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరిస్ ఆడనుంది. మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరగనుంది.
ఈ టీ20తో భారత్లో ఆసీస్ పర్యటన ముగుస్తుంది. ఆసీస్ సిరిస్ తర్వాత న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఇందుకు సంబంధించన పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆసీస్తో ఐదు వన్డేల సిరిస్ను 4-1తో కైవసం చేసుకుని వన్డేల్లో కోహ్లీసేన నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది.
అయితే, భారత్తో సిరిస్కు ముందు న్యూజిలాండ్ జట్టు బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో రెండు వార్మప్ మ్యాచ్లను ఆడనుంది. ఈ రెండు వార్మప్ మ్యాచ్లు ముంబైలోనే జరగనున్నాయి. అక్టోబర్ 22న జరిగే తొలి వన్డేకి ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తుండగా, మూడు టీ20ల్లో చివరిదానికి తిరువనంతపురం ఆతిథ్యమిస్తోంది.
భారత్లో న్యూజిలాండ్ పర్యటన వివరాలు:
Oct 17 (Tuesday): 1st warm-up match at CCI, Mumbai
Oct 19 (Thursday): 2nd Warm-up match at CCI, Mumbai
Oct 22 (Sunday): 1st ODI in Mumbai - 1:30 PM
Oct 25 (Wednesday): 2nd ODI in Pune - 1:30 PM
Oct 29 (Sunday): 3rd ODI in Kanpur - 1:30 PM.
మూడు టీ20లు:
Nov 1 (Wednesday): 1st T20I in Delhi - 7 PM
Nov 4 (Sunday): 2nd T20I in Rajkot - 7 PM
Nov 7 (Wednesday): 3rd T20I in Thiruvananthapuram - 7 PM