హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తక్కువ చేస్తూ టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరోసారి నోరు పారేసుకున్నారు. శ్రీలంకపై కోహ్లీసేన 3-0తో టెస్టు సిరిస్ను క్లీన్ స్వీప్ చేసిన చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఓ జాతీయ ఛానెల్కు రవిశాస్త్రి ఇంటర్యూ ఇచ్చాడు.
సెహ్వాగ్ బాటలో ధోని: దుబాయ్లో క్రికెట్ అకాడమీ
ఆ ఇంటర్యూలో ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాయేనని రవిశాస్త్రి వ్యాఖ్యానించడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని జట్టుని సిద్ధం చేయడంపై రవిశాస్త్రి స్పందించాడు. వికెట్ కీపింగ్లో సాహా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని అతడికి మరెవరూ సాటి రారని అన్నాడు.
'వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్, క్యాచింగ్ విభాగాల్లో సాహా అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తున్నాడు. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో రాణించిన అతడు ఇప్పటికే ధోనీ స్థానాన్ని ఆక్రమించేశాడు. ధోనీ నీడలో ఎదుగుతూ వచ్చిన సాహా, అతడినే మించిపోయాడు' అని చెప్పుకొచ్చాడు.
'ధోని గురించి మాట్లాడేందుకు అసలు నువ్వు ఎవరు?'
ఇటీవల కాలంలో సాహా ఎదిగిన తీరు అద్భుతమని, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం సాహానే నంబర్ వన్ వికెట్ కీపర్ అని అన్నాడు. ధోనీని తక్కువ చేస్తూ శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కొలంబో టెస్టు అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా టెస్టు క్రికెట్లో వృద్ధిమాన్ సాహా బెస్ట్ వికెట్ కీపర్ అని కితాబిచ్చిన సంగతి తెలిసిందే.