లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎబి డివిల్లీర్స్ డకౌట్ కావడం ఓ పాకిస్తాన్ లేడీ జర్నలిస్టును కష్టాల్లోకి నెట్టింది. ప్రపంచంలో వారిద్దరు మేటి బ్యాట్స్మెన్ అనే విషయం అందరికీ తెలిసిందే. పైగా, 2014 తర్వాత కోహ్లీ డకౌట్ అయిన సందర్భం ఇదే.
వారిద్దరు డకౌట్ కావడం ఓ పాకిస్తాన్ మహిళా జర్నలిస్టుకు కష్టాలను తెచ్చి పెట్టింది. క్రికెట్ అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాకిస్తాన్ స్పోర్ట్స్ రిపోర్టర్ జైనాబ్ అబ్బాస్ విరాట్ కోహ్లీ, డివిల్లీర్స్తో సెల్ఫీలు దిగారు.
ఆ సెల్ఫీలు చూసుకుని ఆమె సంబరపడిపోయి ఉంటుంది. కానీ ఆ తర్వాతే ఆమెకు కష్టాలు వచ్చి పడ్డాయి. ఆమెతో సెల్ఫీలకు ఫోజులిచ్చిన ఇద్దరు మేటి బ్యాట్స్మెన్ కూడా డకౌట్ అయ్యారు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో డివిల్లీర్స్ డకౌట్ కాగా, శ్రీలంకతో జరిగిన మ్యాచులో కోహ్లీ డకౌట్ అయ్యాడు.
Two great batsmen - yesterday de Villiers, today Kohli- of the modern era have bagged ducks after a selfie with @ZAbbasOfficial. #BanHer
— Mazher Arshad (@MazherArshad) June 8, 2017
దాంతో సోషల్ మీడియాలో జైనాబ్ను తప్పు పడుతూ వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ నాలుగు డెలివరీలు ఆడి, పరుగులేమీ చేయకుండా నువాన్ ప్రదీప్ చేతిలో అవుటయ్యాడు.