ఇంగ్లాండ్పై 4-0తో సిరిస్ కైవసం
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఇంగ్లాండ్పై 4-0తో టీమిండియా కైవసం చేసుకుని ఈ ఏడాది టెస్టుల్లో నెంబర్ వన్ స్ధానంలో ముగించింది. ఇంగ్లాండ్పై టెస్టు సిరిస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రెండు టాప్ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అశ్విన్కు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ట్రోఫిని అందుకున్న 12వ ఆటగాడు కాగా, భారత ఆటగాళ్లలో మూడోవాడు.అంతకుముందు ద్రవిడ్(2004), సచిన్(2010) ఈ ట్రోఫీని అదుకున్నారు.
అశ్విన్ మరో అరుదైన ఘనత
అయితే ఈ క్రమంలో అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే ఏడాది ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్తో పాటు సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని దక్కించుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. 2004లో రాహుల్ ద్రవిడ్ కూడా ఒకేసారి ఈ రెండు ఘనతలను సాధించాడు.
|
కోహ్లీకి చోటు లభించకపోవడంపై తీవ్ర విమర్శలు
ఇక ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో విరాట్ కోహ్లీకి చోటు లభించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. అంతేకాదు క్రికెట్ ఆస్ట్రేలియా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకోవడం విశేషం.