రెండో వికెట్కు 159 పరుగుల భాగస్వామ్యం
వీరిద్దరూ భారీ షాట్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకు పడి రెండో వికెట్కు 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పాంచాల్ (103), శ్రేయాస్ అయ్యర్ (100) సెంచరీలతో హోరెత్తించి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (19), ఇషాంక్ జగ్గీ (23), ఇషాన్ కిషన్ (11) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు.
20 పరుగుల తేడాతో 4 వికెట్లు
హార్దిక్ పాండ్యా (7) పరుగులకే పెవిలియన్కు చేరాడు. దీంతో ఇండియా ఏ జట్టు 20 పరుగుల తేడాతో 4 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ వి.శంకర్ (103) కూడా అజేయ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతను నితిన్ సైనీతో కలిసి 8వ వికెట్కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
తొలి ఇన్నింగ్స్లో 237 ఆధిక్యం
ఈ క్రమంలో నితిన్ సైనీ (66) అర్ధ సెంచరీతో మెరిశాడు. దీంతో 370 పరుగులు జోడించి 461/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో ముకుంద్ సేనకు 237 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుభాశిష్ రాయ్, తైజుల్ ఇస్లామ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
15 ఓవర్లు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్
కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడంతో బంగ్లాదేశ్కు 15 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ (25)తో పాటు మొమినుల్ హక్ (0)లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్కు పంపాడు.
డ్రాగా ముగిసిన బంగ్లా-ఇండియా ఏ వార్మప్ మ్యాచ్
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (42), మహ్మదుల్లా (1) అజేయంగా నిలిచారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేయడంతో.. మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.