పుజారా-విజయ్
లి టెస్టులో వీరిద్దరూ రాణించడంతో గత పదేళ్ల కాలంలో 2000 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా పుజారా-మురళీ విజయ్లు అవతరించారు. 65.03 యావరేజితో వీరిద్దరి జోడి 32 ఇన్నింగ్స్లాడి 2,080 పరుగులు సాధించారు.
పుజారా-విజయ్: 2080 పరుగులు; 32 ఇనింగ్స్లు; అత్యధిక స్కోరు 370; యావరేజి 66.58.
కోహ్లీ-రహానే
పుజారా-విజయ్ల తర్వాత రెండో స్ధానంలో విరాట్ కోహ్లీ-రహానేల జోడి ఉంది. 25 ఇన్నింగ్స్ లాడిన వీరిద్దరూ 1579 పరుగులు చేశారు.
కోహ్లీ-రహానే: 25 ఇన్నింగ్స్లు, 1579 పరుగులు, అత్యధిక స్కోరు 365, యావరేజి 63.16
ధోని-వీవీఎస్ లక్ష్మణ్
మూడో స్ధానంలో ధోని-వీవీఎస్ లక్ష్మణ్ జోడి ఉంది. 25 ఇన్నింగ్స్లు ఆడిన వీరిద్దరూ 1,214 పరుగులు సాధించారు.
ధోని-లక్ష్మణ్: 25 ఇన్నింగ్స్లు, 1214 పరుగులు, అత్యధిక స్కోరు 259*, యావరేజి 55.18
రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్
టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్లు జోడీ అత్యుత్తమ జోడీ. 28 ఇన్నింగ్స్ లాడిన వీరిద్దరూ 1486 పరుగులు సాధించి నాల్గవ స్ధానంలో ఉన్నారు.
ద్రవిడ్-లక్ష్మణ్: 28 ఇన్నింగ్స్లు, 1486 పరుగులు, అత్యధిక స్కోరు 268, యావరేజి 55.03
గంభీర్-ద్రవిడ్
2065 పరుగులు చేసిన గంభీర్-ద్రవిడ్ల జోడీ ఐదో స్ధానంలో నిలిచింది.
ద్రవిడ్-గంబీర్: 39 ఇన్నింగ్స్లు, 2065 పరుగులు, అత్యధిక స్కోరు 314, యావరేజి 54.34
గంభీర్-సెహ్వాగ్
గంభీర్-సెహ్వాగ్ జోడి 3410 పరుగులు చేసింది. వీరిద్దరి జోడి అత్యధిక పరుగులు సాధించిన జోడీగా గుర్తింపు పొందింది.
గంభీర్-సెహ్వాగ్: 68 ఇన్నింగ్స్లు, 3410 పరుగులు, అత్యధిక స్కోరు 233, యావరేజి 51.66.