అహ్మదాబాద్: దేశవాళీ క్రికెట్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో రంజీ క్రికెటర్ తన్మయ్ పటేల్ గాయపడ్డాడు. హైదరాబాద్, ఛత్తీస్గడ్ జట్ల మధ్య అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో బుధవారం (నవంబర్ 23)న ఈ సంఘటన చోటు చేసుకుంది.
ది హిందు పత్రిక కథనం ప్రకారం రంజీ మ్యాచ్లో భాగంగా లంచ్ విరామానికి ముందు స్పిన్నర్ మెహ్దీ హాసన్ వేసిన బంతిని బలంగా బాదడంతో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న తన్మయ్ అగర్వాల్ హెల్మెట్ను బలంగా తాకింది. దీంతో తన్మయ్ అగర్వాల్ మైదానంలో కుప్పకులాడు.
జస్ట్ మిస్: తలను తాకిన బంతి, కోమాలోకి వెళ్లేవాడు
రంజీ ట్రోఫీ గ్రూప్ సిలో భాగంగా ఛత్తీస్గడ్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే మైదానంలోని అంఫైర్లు మెడికల్ సిబ్బందికి తెలియజేయడంతో వారు పరుగు పరుగున అక్కడకి వచ్చి అగర్వాల్కు ప్రాథమిక చికిత్స చేశారు.
అతడి తల నుంచి రక్తం ఎక్కువగా వస్తుండటంతో స్ట్రెచర్పై అతడిని అంబులెన్స్లోకి ఎక్కించి సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.