న్యూఢిల్లీ: ట్వంటీ20 చరిత్రలో ఇప్పటికే పలు రికార్డులను తుడిచిపెట్టిన భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో అరుదైన రికార్డును తన పేరున నమోదు చేసుకున్నాడు. లీగ్ దశ నుంచే వెళ్లిపోతుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆ జట్టుకు కెప్టెన్గా కోహ్లీ.. ఏకంగా ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.
ఐపిఎల్ టోర్నీలో అద్భుత ఆట తీరుతో విరాట్ కోహ్లీ తన అభిమానుల సంఖ్యను రెట్టింపు చేసుకున్నాడు. అయితే, తన జట్టుకు ట్రోఫీ అందించనప్పటికీ.. అనేక రికార్డులను మాత్రం తిరగరాశాడు కోహ్లీ.
ఐపిఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ తన పేరున రికార్డు నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత అత్యధికంగా నాలుగు శతకాలు బాదిన ఆటగాడిగానూ తన పేరును నమోదు చేసుకున్నాడు. అంతేగాక, అత్యధిక సిక్సులు బాదిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
ఇవన్నీ గాక, కొత్తగా ఎవరికీ దాదాపు సాధ్యంకాని విధంగా ఈ ఐపిఎల్ సీజన్లో 1000 నిమిషాలపాటు క్రీజులోనే ఉన్నాడు కోహ్లీ. పొట్టి ఫార్మాట్లతో ఇదొక అరుదులో అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.