హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నా... అతడి కంటే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కరే గొప్ప బ్యాట్స్మెన్ అని పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ అభిప్రాయపడ్డాడు.
'కోహ్లీ సాధించిన ఘనతల్లో దేనిని నేను తీసిపారేయట్లేదు. అతడు ఓ గొప్ప ఆటగాడు. కానీ నేను సచిన్నే గొప్ప ఆటగాడిగా పరిగణిస్తాను. అతను ఆడిన కాలం అలాంటిది. అతను గొప్ప జట్లను, ఫాస్ట్బౌలర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు.
ఫోటోలు: సింగిల్స్ కోసం కోహ్లీ ఏం త్యాగం చేశాడో తెలుసా?
'90లతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో నాణ్యత లేదు. 2011 వరల్డ్ కప్ తర్వాత ఆటగాళ్ల నాణ్యత పడిపోతూ వచ్చింది. సచిన్ టెండూల్కర్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని, నాణ్యమైన జట్లపై, అన్ని రకాల పరిస్థితుల్లో, అన్ని ఫార్మాట్లలో సాధించిన పరుగుల్ని బట్టి సచిన్ స్థాయిని అంచనా వేయొచ్చు'' అని యూసుఫ్ అన్నాడు.
'సచిన్ టెండూల్కర్ ప్రత్యర్ధి జట్టులో తాను చాలా మ్యాచ్లు ఆడానని, అతడో అద్భుతమైన మాస్టర్ క్లాస్ బ్యాట్స్మెన్ అని ఎన్నోసార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు' అని చెప్పాడు. అయితే కోహ్లీ నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొన్నాడని తాను అనుకోవడం లేదని చెప్పాడు.
తప్పక చూడండి: కోహ్లీతో కలిసి పుట్బాల్ ఆడిన ధోని (వీడియో)
యూసుఫ్ పాకిస్థాన్ జట్టు తరుపున 90 టెస్టు మ్యాచ్లాడి 52.29 యావరేజి నమోదు చేయగా, 288 వన్డేల్లో 41.71 యావరేజిన నమోదు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్ జట్టు వైట్ వాష్కు గురైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ఇప్పటికైనా రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని సూచన చేశాడు.