హైదరాబాద్: జూన్ 18(ఆదివారం) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన తండ్రి రమేశ్ టెండూల్కర్ను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గుర్తు చేసుకున్నారు. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు.
'నా చేయి పట్టుకొని ఈ ప్రపంచాన్ని నాకు చూపించావు. అంతేకాదు.. మంచి సలహా ఇచ్చావు.. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ సచిన్ టెండూల్కర్ పోస్టు చేశాడు. సచిన్ పోస్టు చేసిన 10 నిమిషాల్లోనే ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సచిన్ తండ్రి, ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ గుండెపోటుతో 1999లో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే.